ఈ రోజు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదిన సందర్భంగా జరుపుకునే తెలుగు భాషా దినోత్సవం
పల్లవి:: అమ్మా అను తేనె పలుకు ఆత్మీయత తొలి చినుకు నేర్పినది నీకీ తెలుగు
అంతరిక్ష శాస్త్ర మైన మెరుపువంటి ఆలోచన అంకురించు సృజనే తెలుగు
అను పల్లవి : ప్రౌడమైన,పాడి యైన, పద్యమైన, గద్యమైన వాడుకలో చేర్చెను "గిడుగు"
చ:: పద్యములు కావ్యముగా ఆది కవి వ్రాసెను
పదములను పాటలుగా అన్నమయ్య కూర్చెను
శతకము లో యుగనీతి పంచెను వేమన్న
జీవన రీతి సొబగులు అద్దెను బద్దెన
చ:: అవధానము నాటకములు అంటేనే వేంకట కవి
నవల లెన్నో అవలీలగ విరచించే విశ్వనాథ
శ్రీ నాథుడు పోతన అల్లసాని తిమ్మన
తిక్కన ఎర్రన ధూర్జటి మల్లన
ఎంతమంది కవులు మనకు వేల ఏళ్ల చరిత నడుగు
తొందరపడి విడువకు తెలుగు
ఆపదలో పడినప్పుడు ఎదురు దెబ్బ తిన్నప్పుడు అమ్మ ఒడిని మనసే అడుగు
ధన దాహం తీరాక పరమార్ధం తెలిశాక ("మనిషి") మాతృభాష కడకే అరుగు
No comments:
Post a Comment