తెలుగు పద్య వృత్తాలు చందస్సు -- శార్దూలం

        తెలుగు పద్య వృత్తాలు  చందస్సు  --  శార్దూలం

దీని నడక:
         "తానా తానన తాన తాన తననా తానాన తానాన నా"  
           |________ యతి మైత్రి _________|  13 వ అక్షరం 

ఇంకో రకంగా రాస్తే:
         "తద్ధిత్తోం  తక  తోం న  తోం న  ధిరనా  తద్ధిక్కు  తద్ధిక్కు తా" 
          |______________ యతి మైత్రి ___|  13 వ అక్షరం  

లేకుంటే "గీతాంజలి" సినిమా లో "నంది కొండ వాగుల్లొన "  పాటలో
             " ఓ బాల మ స జ స త త గ -- శార్దూల "  అనే line గుర్తుపెట్టుకొండి.

గణ విభజన చేస్తే     

   మ      స           జ       స        త        త       గ
U U  U   I I  U   I  U I   I  I U  U U I   U U I   U 
తానా తా  నన తా  న తాన  తననా  తానాన  తానాన  నా 

టూకీగా:  శార్దూలం పద్యం 4 పాదాలలో
"మ స జ స త త గ" అనే గణాలు వస్తాయి. 13వ అక్షరంతో యతి మైత్రి. 

ఉదా:
జండాపై కపి రాజు ముందు సిత వాజిశ్రేణినిన్ గూర్చి నే
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండు చున్నప్పు డొ
క్కండున్నీ మొర నాలకింపడు కురుక్ష్మా నాథ సంధింపగాన్ 


(ఈ పద్యం కూడా "పాండవోద్యోగ విజయాలు" లో రాయబార ఘట్టంలోనిదే) 
దీనిని నడక ననుసరించి చదవటం, గణ విభజన, యతి మైత్రి గుర్తించటం  అభ్యాసం ! 

ప్రాస విషయంలో మాత్రం రెండు చిన్న విషయాలు .
1. పాదంలో మొదటి అక్షరంలో గనక సున్నా వస్తే, దానికి కూడా ప్రాస నియమం వర్తిస్తుంది.
    అంటే మొదటి పాదంలో మొదటి అక్షరం గనుక బిందు పూర్వకమైనదైతే మిగతా మూడు పాదాలలోని
    మొదటి అక్షరాలు కూడా బిందు యుక్తమైనవే అయి ఉండాలి.
   (ఈ సూత్రం ఉత్పలమాలకి ఇచ్చిన  ఉదాహరణలో చూడ వచ్చు.)
2. మొదటి పాదంలో ప్రాసాక్షరం గనుక సం యుక్తం, ద్విత్వం, లేక పొడి అక్షరమైతే అన్ని పాదాలలోనూ అలాగే
    సం యుక్తం , ద్విత్వం, పొడి అక్షరం గానే ఉండాలి.

No comments:

Post a Comment